తెలంగాణ: రేపటి నుంచి అకౌంట్లలో పదో విడత రైతుబంధు నిధుల జమ

27 Dec, 2022 21:29 IST|Sakshi

హైదరాబాద్‌: తెలంగాణలో రైతుల ఖాతాల్లో రేపటి నుంచి(బుధవారం, డిసెంబర్‌ 28వ తేదీ) నుంచి పదో విడత రైతు బంధు నిధులు జమ కానున్నాయి. 

ఇప్పటికే పదో విడత కింద రూ.7,676.61 కోట్లు విడుదల చేసింది తెలంగాణ ప్రభుత్వం. అర్హులైన 70.54 లక్షల మంది రైతలు ఖాతాల్లో రైతు బంధు నిధులు జమ కానున్నాయి. 

మరిన్ని వార్తలు