Telangana: దోస్త్‌ రిజిస్ట్రేషన్‌ గడువు పొడిగింపు

22 Sep, 2021 13:08 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: డిగ్రీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే దోస్త్‌ మూడో దశ కౌన్సెలింగ్‌ రిజిస్ట్రేషన్‌ గడువును ఈ నెల 23 వరకూ పొడిగించినట్లు ఉన్నత విద్య కమిషనర్‌ నవీన్‌ మిట్టల్‌ తెలిపారు. కొత్తగా బీఏ (ఆనర్స్‌) కోర్సును రెండు కాలేజీల్లో ప్రవేశపెట్టిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడిం చారు. పొడిగించిన తేదీ వరకు అభ్యర్థులు వెబ్‌ ఆప్షన్స్‌ నమోదు చేసుకోవచ్చని, కొత్త కోర్సులను కూడా ఎంపిక చేసుకోవచ్చని ఆయన వివరించారు. 
 

మరిన్ని వార్తలు