టీఎస్‌ ఎంసెట్‌ అడ్మిషన్స్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల

10 Aug, 2021 19:25 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో ఎంసెట్‌ అడ్మిషన్స్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదలైంది. ఈనెల 30 నుంచి సెప్టెంబర్‌ 9వరకు ధ్రువపత్రాల స్లాట్‌ బుకింగ్‌ చేపడుతున్నట్టు రాష్ట్ర విద్యాశాఖ విభాగం మంగళవారం వెల్లడించింది. సెప్టెంబర్‌ 4 నుంచి 11 వరకు సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుందని తెలిపింది. సెప్టెంబర్‌ 13 వరకు వెబ్‌ఆప్షన్స్‌ నమోదు.. సెప్టెంబర్ 15న మొదటి విడత సీట్ల కేటాయింపు జరుపుతామని చెప్పింది. సెప్టెంబర్‌ 15 నుంచి 20 వరకు కాలేజీల్లో ఆన్‌లైన్‌ రిపోర్టింగ్‌ చేయాలని ఓ ప్రకటనలో పేర్కొంది.
(చదవండి: రేవంత్‌ను నమ్మడం కరెక్టేనా?: మంత్రి ప్రశాంత్‌ రెడ్డి)

మరిన్ని వార్తలు