తెలంగాణ విద్యాశాఖ కీలక నిర్ణయం

12 Sep, 2020 16:21 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  కరోనా విజృంభణను అరికట్టేందుకు తెలంగాణ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు యూజీ, పీజీ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు వారు చదివే కాలేజ్‌లోనే పరీక్ష రాసే వెసులుబాటును విద్యాశాఖ కల్పించింది. అయితే ఈ వెసులుబాటు ఈ ఒక్క సంవత్సరం మాత్రమే అమలులో ఉంటుంది. ఈ నెల 15 నుంచి అన్ని యూనివర్శిటీలలో చివరి సంవత్సరం పరీక్షలు ప్రారంభం కానున్నాయి. (జేఈఈ:‌ తెలంగాణ విద్యార్థులే టాప్‌! )

>
మరిన్ని వార్తలు