విద్యుత్ వాహన రంగానికి కొత్తరూపు
రాయితీలు.. తాయిలాలతో నూతన విధానం
రోడ్డు పన్ను, రిజిస్ట్రేషన్ చార్జీ వందశాతం ఉచితం
వాణిజ్య ఎలక్ట్రిక్ వెహికల్స్ కొనుగోలుకు స్వయం ఉపాధి సాయం
మెట్రో స్టేషన్లకు బ్యాటరీ ఆధారిత వాహనాలు
ప్రతి 50 కిలోమీటర్లకు ఒక చార్జింగ్ స్టేషన్, పార్కింగ్ జోన్
‘తెలంగాణ ఎలక్ట్రిక్ వెహికల్, ఎనర్జీ స్టోరేజీ పాలసీ 2020–2030’ మార్గదర్శకాలు విడుదల
ఏటా లక్షల్లో పెరుగుతున్న వాహనాలు.. పరిమిత సంఖ్యలో పెట్రోల్, డీజిల్ వనరులు.. దీనికి తోడు విజృంభిస్తున్న వాహన కాలుష్యం... వీటన్నింటికీ చెక్ పెట్టేందుకు కనిపిస్తున్న ప్రత్యామ్నాయం.. విద్యుత్ వాహనాలు. అందుకే ప్రపంచం మొత్తం ప్రస్తుతం విద్యుత్ వాహన(ఎలక్ట్రిక్ వెహికల్స్–ఈవీ) తయారీ రంగంపై దృష్టి సారిస్తోంది. ఇదే దిశగా రాష్ట్ర ప్రభుత్వమూ ముందడుగు వేస్తోంది. దీనికోసం ‘తెలంగాణ ఎలక్ట్రిక్ వెహికల్, ఎనర్జీ స్టోరేజీ పాలసీ 2020–2030’ పేరుతో ప్రత్యేక విధానం రూపొందించి, అమల్లోకి తెచ్చేందుకు సిద్ధమైంది. ఈవీ రంగానికి కొత్త రూపు తెస్తోంది.
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రాన్ని విద్యుత్ వాహనాలు, ఎనర్జీ స్టోరేజీ వ్యవస్థకు కేంద్ర బిందువుగా మార్చేందుకు ప్రభుత్వం ‘తెలంగాణ ఎలక్ట్రిక్ వెహికల్, ఎనర్జీ స్టోరేజీ పాలసీ 2020–2030’ని రూపొందించింది. దీనికి ఈ ఏడాది ఆగస్టులో రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం లభించింది. ఈ నూతన విధానాన్ని పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు శుక్రవారం విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో పాలసీ విధి విధానాలపై ఐటీ, కమ్యూనికేషన్ల శాఖ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.
గతేడాది ఏప్రిల్ నుంచి కేంద్ర భారీ పరిశ్రమల శాఖ అమలు చేస్తున్న ‘ఫేమ్ 2’పథకం నిబంధనలకు లోబడి ఈ పాలసీని సిద్ధం చేసినట్లు పేర్కొంది. ఈవీ రంగంలో పెట్టుబడుల ఆకర్షణ, పరిశోధన, అభివృద్ధి, తయారీకి ప్రోత్సాహం, వ్యక్తిగత, వాణిజ్య రంగాల్లో రవాణా ఖర్చు తగ్గింపు, ప్రపంచ స్థాయి మౌలిక వసతుల కల్పనే లక్ష్యంగా పదేళ్ల పాటు కొత్త పాలసీ పనిచేస్తుంది. (చదవండి: తెలంగాణ బ్రాండ్.. సర్కారీ మెడికల్ షాపులు! )
నూతన విధానంలోని ముఖ్యాంశాల్లో కొన్ని..