సాక్షి, హైదరాబాద్: ఉద్యోగుల బదిలీలపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో పరస్పర ఉద్యోగుల బదిలీకి ప్రభుత్వం అంగీకారం తెలిపింది. ఉద్యోగులిద్దరూ పరస్పరం అవగాహన వస్తే బదిలీకి అవకాశం ఉంది. ఉద్యోగుల విజ్ఞప్తులన్నింటినీ పరిశీలించాలని సీఎం కేసీఆర్ సూచించారు. భార్యాభర్తల కేసులను తక్షణం పరిష్కరించాలని కేసీఆర్ ఆదేశించారు. బదిలీలపై రేపు లేదా ఎల్లుండి అధికారిక ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉంది.
చదవండి: ప్రగతి భవన్ దగ్గర జేసీ దివాకర్రెడ్డి ఓవర్ యాక్షన్