కోవాగ్జిన్‌ రెండో డోసుపై ప్రభుత్వం కీలక ప్రకటన

16 May, 2021 22:03 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వం వ్యాక్సినేషన్‌కు సంబంధించి కీలక ప్రకటన విడుదల చేసింది. రాష్ట్రంలో కోవాగ్జిన్‌ రెండో డోసు వ్యాక్సినేషన్ నిలిపివేస్తున్నట్లు  ప్రకటించింది. 45 ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సిన్ నిలిపి వేయగా.. కేంద్రం నుంచి సరఫరా లేకపోవడంతో వ్యాక్సినేషన్ నిలిపివేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. తదుపరి వ్యాక్సినేషన్ తేదీలు త్వరలోనే ప్రకటిస్తామన్న ఆరోగ్యశాఖ వెల్లడించింది. 

( చదవండి: కరోనాకు ధైర్యమే మందు అంటూ... )
 

మరిన్ని వార్తలు