గవర్నర్‌ క్రిస్మస్‌ శుభాకాంక్షలు 

25 Dec, 2022 01:39 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: గవర్నర్‌ తమిళిసై సౌందర రాజన్‌ రాష్ట్ర ప్రజలకు క్రిస్మస్‌ శుభాకాంక్షలు తెలిపారు. యేసుక్రీస్తు జన్మదినాన్ని జరుపుకోవడం, ఆయన ఆదర్శాలను గౌరవించడం సంతోషకరమని తెలిపారు. ఆయన జీవితం ప్రేమ, క్షమాపణ, సత్యం, కరుణ, సోదరభావం, త్యాగానికి ప్రతీకని అభివర్ణించారు. ఈ క్రిస్‌మస్‌ అందరికీ అనంతమైన ఆనందం, ప్రేమ, శాంతిని అందించాలని ఆకాంక్షించారు.  

మరిన్ని వార్తలు