గురుకుల సెట్‌–22 దరఖాస్తుకు గడువు పెంపు

29 Mar, 2022 03:36 IST|Sakshi

ఏప్రిల్‌ 7వరకు పెంచినట్లు సెట్‌కన్వీనర్‌ వెల్లడి

సాక్షి, హైదరాబాద్‌: గురుకుల విద్యా సంస్థల్లో ఐదో తరగతి ప్రవేశాలకు నిర్వహించనున్న గురుకుల సెట్‌(వీటీజీసెట్‌)–2022 దరఖాస్తు గడువును ఏప్రిల్‌ 7 వరకు పొడిగిస్తున్నట్లు సెట్‌ చీఫ్‌ కన్వీనర్‌ రోనాల్డ్‌రాస్‌ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. వీటీజీసెట్‌–22 మే 8న ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నం 1గంటల వరకు నిర్వహించనున్నారు. మరిన్ని వివరాలకు సొసైటీ వెబ్‌సైట్‌లో పరిశీలించవచ్చని ఆ ప్రకటనలో తెలిపారు.

మరిన్ని వార్తలు