మునుగోడు గుర్తుల వివాదం.. హైకోర్టులో టీఆర్‌ఎస్‌ పిటిషన్‌ కొట్టివేత

18 Oct, 2022 13:31 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మునుగోడు ఉపఎన్నికల గుర్తుల వివాదంలో టీఆర్‌ఎస్‌కు ఎదురు దెబ్బ తగిలింది. టీఆర్‌ఎస్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను మంగళవారం ఉన్నత న్యాయస్థానం కొట్టేసింది. 

కారును పోలిన గుర్తులను ఇవ్వొద్దని టీఆర్‌ఎస్‌ పిటిషన్‌ దాఖలు చేయగా.. ఈసీ వాదనతో ఏకీభవించిన కోర్టు సదరు పిటిషన్‌ను కొట్టేసింది. 

మునుగోడు స్వతంత్ర అభ్యర్థులకు ఇప్పటికే గుర్తులు కేటాయించామని హైకోర్టుకి నివేదించింది ఎన్నికల సంఘం. దీంతో ఈ సమయంలో ఈ పిటిషన్ పై జోక్యం చేసుకోలేమన్న హైకోర్టు.. టీఆర్ఎస్ వేసిన పిటిషన్ ను డిస్మిస్ చేసింది.

మరిన్ని వార్తలు