రిజర్వేషన్లు ప్రకటించిన ఇంటర్‌ బోర్డ్

16 Sep, 2020 20:17 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ (2020-21) సంవత్సరానికి అడ్మిషన్ షెడ్యూల్‌ ప్రకటించింది. అప్లికేషన్ ఫామ్‌ను సెప్టెంబర్‌ 16(బుధవారం)న ఇష్యూ చేస్తుంది. ఆన్‌లైన్‌ తరగతులను సెప్టెంబర్‌ 18(శుక్రవారం)న ప్రారంభించనున్నారు. అడ్మిషన్లకు చివరి తేదీగా సెప్టెంబర్‌ 30న బోర్డ్‌ నిర్ణయించింది. అయితే కేటగిరీ వారిగా రిజర్వేషన్లు: షెడ్యూల్ క్యాస్ట్స్(ఎస్‌సీ)-15శాతం, షెడ్యూల్ ట్రైబ్స్(ఎస్టీ)-6శాతం, బ్యాక్వర్డ్ క్లాసెస్(బీసీ)- 29శాతం(బీసీ సబ్‌ కేటగిరీల వారిగా రిజర్వేషన్లు: బీసీ ఏ (7శాతం), బీసీ బీ (10శాతం), బీసీ సీ (1శాతం), బీసీ డీ (7శాతం), బీసీ ఈ (4శాతం), ఫిజికల్లీ హ్యాండీక్యాప్డ్(3శాతం), ఎన్‌సీసీ, స్పోర్ట్స్, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్(5శాతం), ఎక్స్ సర్వీస్‌మెన్, డిఫెన్స్, పర్సనల్ రిసైడింగ్ ఇన్ ద స్టేట్(3శాతం), ఎకనామికల్లీ వీకర్ సెక్షన్(10శాతం) ఇంటర్మీడియట్ బోర్డు తెలిపింది. అయితే మొత్తం సీట్లలో 33.3శాతం బాలికలకు కేటాయించినట్లు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ సెక్రెటరీ సయ్యద్ ఉమర్ జలీల్ పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు