సీఎం తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి: జాజుల

4 Feb, 2022 04:00 IST|Sakshi

కవాడిగూడ: రాజ్యాంగాన్ని మార్చాలన్న సీఎం కేసీఆర్‌ తక్షణమే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్‌ డిమాండ్‌ చేశారు. రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ముఖ్యమంత్రి అయిన కేసీఆర్, అదే రాజ్యాంగాన్ని మార్చాలనుకోవడం అవివేకమ న్నారు. రాజ్యాం గాన్ని మార్చాలని సీఎం చేసిన వ్యాఖ్య లను నిరసిస్తూ గురువారం ఇందిరా పార్కు ధర్నాచౌక్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జాజుల మాట్లాడారు. బీఆర్‌ అంబేడ్కర్‌ను కేసీఆర్‌ అవమాన పరిచారని, దీనికి నిరసనగా రేపటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేప ట్టాలని ఆయన పిలుపునిచ్చారు. 

మరిన్ని వార్తలు