‘కేంద్రం మెడలు వంచి ధాన్యాన్ని కొనిపిస్తాం’ 

10 Apr, 2022 02:39 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కేంద్రం మెడలు వంచి తెలంగాణ ధాన్యాన్ని కొని పించి తీరుతామని పీయూసీ చైర్మన్, నిజామాబాద్‌ జిల్లా టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు, ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి అన్నారు. శనివారం టీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ బండి సంజయ్‌ బట్టేబాజ్, బ్రెయిన్‌లెస్‌ ఎంపీగా మారిపోయారని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

అసలు సంజయ్‌ తెలంగాణలో పుట్టాడా? గుజరాత్‌లో పుట్టాడా అనే అనుమా నం కలుగుతోందన్నారు. బీజేపీ నేతలు ధాన్యం సేకరణపై ఒక్కొక్కరు ఒక్కో తరహాలో మాట్లాడుతున్నారని, ప్రతి గింజ కేంద్రంతో కొనిపిస్తామని చెప్పిన బీజేపీ నేతలు ఇప్పుడు తమను అడగడం విడ్డూరంగా ఉందని విమర్శించారు.  బీజేపీకి పీసీసీ చీఫ్‌ రేవంత్‌ సామంతుడిలా మారారని, తెలంగాణ వ్యతిరేకుల గూటి పక్షి రేవంత్‌ అని వ్యాఖ్యానించారు. సంజయ్‌కు మతి తప్పిందని, ఆయ న్ను వెంటనే మెంటల్‌ ఆస్పత్రికి తరలించాలని ఎద్దేవా చేశారు. ఈనెల 11న ఢిల్లీలో ధర్నా చేస్తామని, చేతనైతే మోదీని బతిమిలాడి తెలంగాణ ధాన్యం కొనిపించాలని సూచించారు.   

మరిన్ని వార్తలు