నిర్మల్ జిల్లా: ఏడాది కాలంగా కరోనా దేశంలో కల్లోలం సృష్టిస్తోంది. అయితే గిరిజన ప్రాంతాలకు మాత్రం ఆ వైరస్ పాకడం లేదు. వారు తీసుకుంటున్న జాగ్రత్త చర్యలు వారికి శ్రీరామరక్షగా నిలుస్తోంది. అయితే తొలిసారిగా గిరిజన ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యేకు కరోనా వైరస్ సోకింది. ఆమెనే ఖానాపూర్ టీఆర్ఎస్ రేఖానాయక్. ఇటీవల ఆమె పరీక్షలు చేయించుకోగా కరోనా నిర్ధారణ అయ్యింది. దీంతో ఆమె వెంటనే హోం క్వారంటైన్లోకి వెళ్లారు.
చదవండి: నేడో రేపో ఎమ్మెల్యే పదవికి ఈటల రాజీనామా?
చదవండి: డీఎంకే విజయంలో ‘ఇటుక’దే కీలక పాత్ర