బీజేపీలోకి గట్టు శ్రీకాంత్‌రెడ్డి! 

6 Apr, 2021 00:27 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి ఇటీవల రాజీనామా చేసిన డాక్టర్‌ గట్టు శ్రీకాంత్‌రెడ్డి త్వరలోనే బీజేపీలో చేరనున్నారు. సోమవారం ఆయన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ని కలిశారు. ఈ సందర్భం గా వివిధ అంశాలపై చర్చించారు. ఇటీవల వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ జాతీయ పార్టీలో చేరే అవకాశం ఉందని ప్రకటించారు. ఆ వెనువెంటనే ఆయన మాజీ ఎమ్మెల్యే ఎన్‌వీఎస్‌ఎస్‌ ప్రభాకర్‌తో కలసి వచ్చి సంజయ్‌తో భేటీ అయ్యారు.  మంచి రోజు చూసుకొని పార్టీ ముఖ్యనేతల సమక్షం లో ఆయన బీజేపీలో చేరనున్నట్లు తెలిపారు. 

చదవండి: (వైఎస్సార్‌సీపీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు రాజీనామా)

మరిన్ని వార్తలు