సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో శుక్రవారం 10,044 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, వారిలో 103 మంది వైరస్ బారిన పడ్డారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 8.37 లక్షలకు చేరుకుంది. ఒక్క రోజులో కరోనా నుంచి 111 మంది కోలుకోగా, ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 8.32 లక్షలకు చేరింది.