Telangana: కరోనా 119 కేసులు

8 Jun, 2022 01:17 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సరిగ్గా మూడు నెలల తర్వాత రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య ఒక్క రోజులో 100 దాటింది. ఈ ఏడాది మార్చి ఏడో తేదీన 102 కేసులు నమోదు కాగా, సరిగ్గా మూడు నెలలకు మంగళవారం ఒక్క రోజులోనే 119 కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. అందులో ఒక్క హైదరాబాద్‌లోనే 79 కేసులు నమోదయ్యాయి. ఏప్రిల్‌ 17న 11కి చేరి, మహమ్మారి ప్రారంభమైనప్పటి నుండి అప్పటివరకు కనిష్ట స్థాయికి చేరుకుంది.

మళ్లీ మే నెల మధ్యలో నెమ్మదిగా పెరగడం ప్రారంభించింది. ప్రస్తుత పాజిటివిటీ రేటు 0.75శాతం. కాగా, రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 7.93లక్షలకు చేరుకుంది. ఒక రోజులో 43 మంది రోగులు కోలుకున్నట్లు ప్రకటించారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య 7.89లక్షలకు చేరుకుంది. ప్రస్తుతం క్రియాశీలక కేసులు 658 ఉన్నాయి.

మరిన్ని వార్తలు