Telangana: కొత్తగా 130 కరోనా కేసులు

9 Sep, 2022 02:30 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో గురువారం 11,127 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, వారిలో 130 మంది వైరస్‌ బారిన పడ్డారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 8.35 లక్షలకు చేరుకుంది. ఒక్కరోజులో కరోనా నుంచి 159 మంది కోలుకోగా, ఇప్పటి వరకు కోలుకున్నవారి సంఖ్య 8.30 లక్షలకు చేరింది. ప్రస్తుతం 982 క్రియాశీలక కేసులు నమోదయ్యాయి.  

మరిన్ని వార్తలు