సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో గురువారం నిర్వహించిన 5,867 కరోనా నిర్ధారణ పరీక్షల్లో 16 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 8.41 లక్షలకు చేరుకుంది. ఒక్కరోజులో కరోనా నుంచి 10 మంది కోలుకోగా, ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 8.36 లక్షలకు చేరింది.