Telangana: కొత్తగా 192 కరోనా కేసులు 

30 Aug, 2022 03:56 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో సోమవారం 14,320 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, వారిలో 192 మంది వైరస్‌ బారినపడ్డారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 8.34 లక్షలకు చేరింది. ఒక్కరోజులో కరోనా నుంచి 345 మంది కోలుకోగా, ఇప్పటి వరకు కోలుకున్నవారి సంఖ్య 8.28 లక్షలకు చేరింది. ప్రస్తుతం 1,924 క్రియాశీలక కేసులు నమోదయ్యాయి.   

మరిన్ని వార్తలు