Telangana: కొత్తగా 246 కరోనా కేసులు 

21 Jun, 2022 02:52 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. సోమవారం 20,507 మందికి కరోనా నిరారణ పరీక్షలు చేయగా, అందులో 246 మంది వైరస్‌ బారినపడ్డారు. అత్యధికంగా హైదరాబాద్‌లో 185 మందికి వైరస్‌ సోకింది. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 7.96 లక్షలకు చేరింది. ఒకరోజులో 155 మంది కోలుకున్నారు. ప్రస్తుతం 2,117 క్రియాశీలక కేసులున్నాయి. 

మరిన్ని వార్తలు