సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రెండ్రోజులుగా 200కు పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. గురువారం 28,424 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, అందులో 285 మంది వైరస్ బారిన పడ్డారు. అత్యధికంగా హైదరాబాద్లో 188 మందికి వైరస్ సోకింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 7.95 లక్షలకు చేరింది. ఒక రోజులో 65 మంది కోలుకున్నారు.