సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో శనివారం 24399 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, వారిలో 357 మంది వైరస్ బారినపడ్డారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 8.31 లక్షలకు చేరింది. ఒక్కరోజులో 440 మంది కోలుకోగా, ఇప్పటి వరకు కోలుకున్నవారి సంఖ్య 8.24 లక్షలకు చేరింది. ప్రస్తుతం 2711 క్రియాశీలక కేసులు నమోదయ్యాయి.