సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఆదివారం 22,384 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, అందులో 457 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 8.02 లక్షలకు చేరుకుంది. ఒక్కరోజులో 494 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇప్పటివరకు మొత్తం కోలుకున్న వారి సంఖ్య 7.93 లక్షలకు చేరింది.