Telangana: కొత్తగా 496 మందికి కరోనా 

26 Jun, 2022 01:18 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కొత్తగా 496 మందికి కోవిడ్‌ నిర్ధారణయ్యింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు 7,98,621 మంది కరోనా వైరస్‌ బారిన పడ్డారు. వీరిలో 7,90,897 మంది కోలుకోగా మరో 3,613 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా వైరస్‌ ప్రభావంతో రాష్ట్రంలో 4,111 మంది మృత్యువాత పడ్డారు.

శనివారం రాష్ట్రవ్యాప్తంగా 28,808 నిర్ధారణ పరీక్షలు చేశారు. ఇందులో 342 నమూనాల ఫలితాలు వెలువడాల్సి ఉందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. 

మరిన్ని వార్తలు