Telangana: కొత్తగా 59 కరోనా కేసులు  

1 Jun, 2022 01:33 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో మంగళవారం 11,203 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, అందులో 59 మంది వైరస్‌ బారిన పడ్డారు. ఇప్పటి వరకు మొత్తం కేసుల సంఖ్య 7.93 లక్షలకు చేరుకుంది. తాజాగా 40 మంది కోలుకోగా, మొత్తం 7.88 లక్షల మంది కోలుకున్నారు. ఇక ప్రస్తుతం 435 క్రియాశీలక కరోనా కేసులున్నాయని ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్‌ శ్రీనివాసరావు కరోనా బులిటెన్‌లో వెల్లడించారు.   

మరిన్ని వార్తలు