సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఆదివారం 8,392 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, అందులో 63 మంది వైరస్ బారిన పడ్డారు. ఇప్పటి వరకు మొత్తం కేసుల సంఖ్య 7.93 లక్షలకు చేరుకుంది. తాజాగా 47 మంది కోలుకోగా, మొత్తం 7.88 లక్షల మంది వైరస్ నుంచి బయటపడ్డారు.
ఇక ప్రస్తుతం 563 క్రియాశీలక కరోనా కేసులున్నాయని ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావు కరోనా బులిటెన్లో వెల్లడించారు.