Telangana: ఒక్కరోజే 640 మందికి కరోనా

21 Jul, 2022 02:49 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో మంగళవారం 31,265 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, 640 మంది వైరస్‌ బారిన పడ్డారు. దీంతో రాష్ట్రంలో మొత్తం నమోదైన కరోనా కేసుల సంఖ్య 8.11 లక్షలకు చేరింది. ఒక్కరోజులో కరోనా నుంచి 659 మంది కోలుకోగా, ఇప్పటివరకు కోలుకున్నవారి సంఖ్య 8.03 లక్షలకు చేరింది. 

మరిన్ని వార్తలు