సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మరో 652 మంది కరోనా బారిన పడ్డారు. ఇప్పటివరకు 8,25,360 మందికి కరోనా సోకగా, 8,15,030 మంది కోలుకున్నారు. మరో 6,219 మంది చికిత్స పొందుతున్నారు.
ఇప్పటివరకు కరోనాతో 4,111 మంది మృతిచెందారు. శనివారం రాష్ట్రవ్యాప్తంగా 40,451 కరోనా పరీక్షలు చేయగా, 769 నమూనాల ఫలితాలు వెలువడాల్సి ఉందని ప్రజారోగ్య విభాగం ఒక ప్రకటనలో తెలిపింది.