Telangana: ఒక్కరోజే 658 మందికి కరోనా

20 Jul, 2022 01:03 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. రాష్ట్రంలో మంగళవారం 30,552 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, 658 మంది వైరస్‌ బారిన పడ్డారు. దీంతో రాష్ట్రంలో మొత్తం నమోదైన కరోనా కేసుల సంఖ్య 8.10 లక్షలకు చేరింది.

ఒక్కరోజులో కరోనా నుంచి 628 మంది కోలుకోగా, ఇప్పటివరకు కోలుకున్నవారి సంఖ్య 8.02 లక్షలకు చేరింది. ప్రస్తుతం 4,511 క్రియాశీలక కేసులున్నాయని ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్‌ శ్రీనివాసరావు వెల్లడించారు. 

>
మరిన్ని వార్తలు