Telangana: కొత్తగా 71 కరోనా కేసులు

19 Sep, 2022 03:11 IST|Sakshi

8.36 లక్షలకు చేరిన మొత్తం కేసులు

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఆదివారం 7,007 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, వారిలో 71 మంది వైరస్‌ బారినపడ్డారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 8.36 లక్షలకు చేరింది. ఒక్కరోజులో 88 మంది కోలుకోగా, ఇప్పటివరకు కోలుకున్నవారి సంఖ్య 8.31 లక్షలకు చేరింది. ప్రస్తుతం 751 క్రియాశీలక కేసులు నమోదయ్యాయి.  

మరిన్ని వార్తలు