Telangana: 771 కరోనా కేసులు

2 Aug, 2022 03:27 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కరోనా కేసులు భారీగానే నమోదవుతున్నాయి. సోమవారం 39,320 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, అందులో 771 మందికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 8.20 లక్షలకు చేరింది. ఒక రోజులో కరోనా నుంచి 581 మంది కోలుకోగా, ఇప్పటివరకు 8.10 లక్షల మంది కోలుకున్నారు. ప్రస్తుతం 5,733 క్రియాశీలక కేసులున్నాయి.   

>
మరిన్ని వార్తలు