సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో శనివారం 8,809 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, వారిలో 83 మంది వైరస్ బారిన పడ్డారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 8.38 లక్షలకు చేరుకుంది.
ఒక్కరోజులో కరోనా నుంచి 84 మంది కోలుకోగా, ఇప్పటి వరకు కోలుకున్నవారి సంఖ్య 8.33 లక్షలకు చేరింది. ప్రస్తుతం 490 క్రియాశీలక కేసులు నమోదయ్యాయి.