Telangana: కొత్తగా 851 మందికి కరోనా

31 Jul, 2022 02:14 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కొత్తగా 851 మంది కరోనా బారిన పడ్డారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 8,19,141 మందికి కరోనా పాజిటివ్‌ రాగా, ఇందులో 8,09,661 మంది కోలుకున్నారు. మరో 5,369 మంది చికిత్స పొందుతుండగా.. 4,111మంది మృతిచెందారు.

శనివారం రాష్ట్రవ్యాప్తంగా 38,024 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, 570 నమూనాలకు సంబంధించి ఫలితాలు వెలువడాల్సి ఉందని వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. 

మరిన్ని వార్తలు