సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా పెరిగాయి. రోజురోజుకు వైరస్ ఉధృతి పెరుగుతోంది. శుక్రవారం 40,593 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, వారిలో 923 మంది వైరస్ బారిన పడ్డారు. హైదరాబాద్లో అత్యధికంగా 366 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 8.18 లక్షలకు చేరింది.