సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఉన్నతస్థాయి సమీక్ష

24 May, 2021 17:13 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ర్టంలో కరోనా పరిస్థితులు, లాక్‌డౌన్‌, వ్యాక్సినేషన్‌పై సీఎం కేసీఆర్ అధ్యక్షతన సోమవారం ఉన్నతస్థాయి సమీక్ష జరిగింది. ఈ స‌మావేశానికి సీఎస్ సోమేశ్ కుమార్, డీజీపీ మ‌హేంద‌ర్ రెడ్డి, సీపీల‌తో పాటు వైద్యారోగ్య శాఖ ఉన్న‌తాధికారులు హాజ‌ర‌య్యారు. ఇందులో క‌రోనా వ్యాక్సినేష‌న్‌ పాలసీపై తెలంగాణ ప్రభుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకోనుంది. టీకా విషయంలో ప్రజల్లో తిరిగే ఫ్రంట్ లైన్ వారియ‌ర్ల‌కే మొదట ప్రాధాన్యత ఇవ్వాలని యోచిస్తోంది. ఫ్రంట్‌ లైన్‌ వారియర్ల జాబితాలో జ‌ర్న‌లిస్టులు, గ్యాస్ బాయ్స్, కూర‌గాయ‌ల వ్యాపారుల‌తో పాటు చిరు వ్యాపారుల‌ను ప్రభుత్వం చేర్చింది.

చదవండి: Lockdown: సార్‌.. మా కుక్కకు జ్వరం.. వదిలేయండి.. సరే

>
మరిన్ని వార్తలు