దావోస్‌ సదస్సుకు కేటీఆర్‌ 

16 May, 2022 01:45 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరిగే వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం సదస్సుకు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు హాజరవుతారు. ఈ నెల 22 నుంచి 26 వరకు సదస్సు జరగనుండగా, కేటీఆర్‌ ఈ నెల 17న బయల్దేరి వెళ్తారు. సదస్సు ముగిసిన తర్వాత ఈ నెల 27న తిరిగి హైదరాబాద్‌కు కేటీఆర్‌ చేరుకుంటారు. ఈ ఏడాది జనవరిలోనే సదస్సు జరగాల్సి ఉన్నా కోవిడ్‌ మూలంగా వాయిదా పడింది.   

మరిన్ని వార్తలు