కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు మంత్రి కేటీఆర్‌ లేఖ

15 Jul, 2021 18:13 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కంటోన్మెంట్‌ పరిధిలో ఇష్టారీతిన రోడ్లు మూసేస్తుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు మంత్రి కేటీఆర్‌ లేఖ రాశారు. ఈ సందర్భంగా ఆయన లేఖలో..  కరోనా పేరుతో రోడ్లు మూసేస్తున్నారని, ఈ క్రమంలో ప్రజలు కిలోమీటర్ల మేర అదనంగా ప్రయాణాలు చేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. కంటోన్మెంట్‌ యాక్ట్‌ సెక్షన్‌ 258కి ఈ చర్యలు విరుద్ధమని తెలిపారు. సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ పరిధిలో రోడ్లు మూసివేయకుండా స్థానిక మిలటరీ అధికారులకు ఆదేశాలివ్వాలని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు