సాక్షి, హైదరాబాద్: భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్, నేషనల్ గైడ్స్ కమిషనర్గా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నియమితులయ్యారు. ఈ విషయాన్ని భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ డైరెక్టర్ రాజ్కుమార్ కౌశిక్ శుక్రవారం ప్రకటించారు.
కవిత నేషనల్ గైడ్స్ కమిషనర్గా ఏడాది పాటు సేవలందించనున్నారు. ఆమె 2015 నుంచి స్కౌట్స్ అండ్ గైడ్స్ రాష్ట్ర చీఫ్ కమిషనర్గా సేవలందించారు. స్కౌట్స్ అండ్ గైడ్స్లో దేశవ్యాప్తంగా విద్యార్థుల భాగస్వామ్యం మరింత పెరిగేలా కృషి చేస్తానని ఈ సందర్భంగా కవిత తెలిపారు.