గడ్కరీకి రాయగిరి రైతుల గోడు 

11 Sep, 2022 04:02 IST|Sakshi
రాయగిరి రైతులతో ఎంపీ కోమటిరెడ్డి 

బాధితులకు ఎంపీ కోమటిరెడ్డి హామీ  

సాక్షి, యాదాద్రి: రీజినల్‌ రింగ్‌ రోడ్డుతో భూ­ములు పూర్తిగా కోల్పోతున్న రాయగిరి రైతుల సమస్యను కేంద్ర మంత్రి గడ్కరీని సోమ­వారం కలిసి వివరిస్తానని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చెప్పారు. శనివారం భువనగిరిలో రాయగిరి నిర్వాసితులు ఎంపీ వెంకట్‌రెడ్డిని కలిసి తమ గోడు విన్నవించుకున్నారు. వారితో ఎంపీ మాట్లాడుతూ.. కేంద్రమంత్రి నితిన్‌గడ్కరీ సోమవారం మధ్యా­హ్నం అపాయింట్‌మెంట్‌ ఇచ్చారని, ఆయ­నతో రీజినల్‌ రింగ్‌రోడ్డు సమస్యలపై చర్చిస్తానని చె­ప్పా­­రు.

రాయగిరితోపాటు పలుచోట్ల్ల త్రిబుల్‌ ఆర్‌ అలైన్‌మెంట్‌ మార్చాలని వినతులు వచ్చినట్లు చెప్పారు. కేంద్రమంత్రిని కలిసి స్థానిక సమస్యలు తెలిపి అలైన్‌మెంట్‌ మార్చే విధంగా చూస్తానని కోమటిరెడ్డి హామీ ఇచ్చారు.  

మరిన్ని వార్తలు