పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల
సాక్షి, హైదరాబాద్: కేంద్రంలోని బీజేపీ సర్కార్ నిర్దేశించిన లక్ష్యం కన్నా అధికంగా రాష్ట్రంలో ధాన్యం సేకరణ జరిగిందని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. దేశ వ్యాప్తంగా 593 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరిస్తే, 70 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణతో తెలంగాణ మూడో స్థానంలో నిలిచిందని శుక్రవారం ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. వానాకాలం సీజన్లో రైతులు పండించిన ప్రతీ ధాన్యం గింజ కొనాలన్న సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు గత సంవత్సరం కన్నా దాదాపు 44 శాతం అధికంగా సేకరించినట్లు తెలిపారు.