కొత్తగా 144 కరోనా కేసులు

19 Nov, 2021 05:42 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో గురువారం 35,659 కరోనా పరీక్షలు నిర్వహించగా... 144 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు నమోదైన పాజిటివ్‌ కేసుల సంఖ్య 6.74 లక్షలకు చేరింది. ఈ మేరకు ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్‌ శ్రీనివాసరావు బులెటిన్‌ విడుదల చేశారు. ఒక్క రోజులో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 3,978కి చేరింది.

మరిన్ని వార్తలు