Telangana: కొత్తగా 30 మందికి కరోనా 

29 Mar, 2022 04:00 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో సోమవారం 17,806 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, 30 మందికి పాజిటివ్‌గా వచ్చింది. దీంతో ఇప్పటివరకు మొత్తం కరోనా కేసుల సంఖ్య 7.91 లక్షలకు చేరింది. తాజాగా మరో 52 మంది కోలుకోగా.. ఇప్పటి వరకు 7.86 లక్షల మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 492 మంది కరోనా చికిత్స పొందుతున్నారు.

మరిన్ని వార్తలు