సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా 45 మందికి కోవిడ్–19 నిర్ధారణయ్యింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో 792571 మంది కరోనా బారిన పడగా, 788036 మంది కోలుకున్నారు. 424 మంది చికిత్స పొందుతున్నారు.
కరోనా ప్రభావంతో ఇప్పటివరకు 4111 మంది మృత్యువాత పడ్డారు. శనివారం రాష్ట్రవ్యాప్తంగా 13086 నిర్ధారణ పరీక్షలు చేయగా, 833 నమూనాల ఫలితాలు వెలువడాల్సి ఉందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది.