Telangana: కొత్తగా 47 మందికి కరోనా 

20 May, 2022 02:20 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో గురువారం 12,458 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా 47 మందికి పాజిటివ్‌ వచ్చింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం కరోనా కేసుల సంఖ్య 7.92 లక్షలకు చేరింది. తాజాగా 34 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇప్పటివరకు 7.88 లక్షల మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 396 మంది చికిత్స పొందుతున్నారు.   

మరిన్ని వార్తలు