సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఆదివారం 17,022 మందికి కరోనా పరీక్షలు చేయగా, అందులో 82 మంది వైరస్ బారినపడ్డారు. ఇప్పటి వరకు మొత్తం కరోనా కేసులసంఖ్య 7.89 లక్షలకు చేరుకుంది. తాజాగా కరోనా నుంచి 311 మంది కోలుకోగా, మొత్తం 7.83 లక్షల మంది రికవరీ అయ్యారు. ఇప్పటివరకు 4,111 మంది మృతిచెందారు. ప్రస్తుతం 1,710 క్రియాశీలక కరోనా కేసులున్నాయి.