కొత్తగా 171 కరోనా కేసులు 

27 Nov, 2021 01:20 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో శుక్రవారం 38,731 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 171 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు నమోదైన పాజిటివ్‌ కేసుల సంఖ్య 6.75 లక్షలకు చేరింది. ఈ మేరకు ప్రజారోగ్య సంచాలకుడు శ్రీనివాసరావు బులెటిన్‌ విడుదల చేశారు. ఒక్క రోజులో ఒకరు ప్రాణాలు కోల్పోగా, మొత్తం మృతుల సంఖ్య 3,987కి చేరింది. ఒక్కరోజు వ్యవధిలో 167 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో కోలుకున్న వారి సంఖ్య 6.67 లక్షలకు చేరింది.   

మరిన్ని వార్తలు