బస్‌పాస్‌ చార్జీల పెంపు ఉపసంహరించండి 

12 Jun, 2022 01:11 IST|Sakshi

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ ట్వీట్‌  

సాక్షి, హైదరాబాద్‌: భారీగా బస్‌పాస్‌ చార్జీల పెంపు నిర్ణయం పేద, మధ్య తరగతి వర్గాలను చదువుకు దూరం చేసేలా ఉందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. ఈ మేరకు శనివారం ఆయన ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. ఆర్టీసీ తీసుకున్న నిర్ణయం పేద, మధ్యతరగతి వర్గాల నడ్డి విరిచేలా ఉందని పేర్కొన్నారు. ఈ అన్యాయపు నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని ఆ ట్వీట్‌లో రేవంత్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.    

మరిన్ని వార్తలు