తెలంగాణ ఐపీఎస్‌లకు అన్యాయం 

30 Dec, 2022 00:43 IST|Sakshi

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ ట్వీట్‌  

సాక్షి, హైదరాబాద్‌: ఐపీఎస్‌ల పోస్టింగ్‌ల విషయంలో తెలంగాణ అధికారులకు తీవ్ర అన్యాయం జరిగిందని టీపీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్‌రెడ్డి ట్విట్టర్‌ వేదికగా ధ్వజమెత్తారు. డీజీపీతో సహా ఆరుగురు సీనియర్‌ ఐపీఎస్‌లకు కీలక పోస్టింగ్‌లు ఇవ్వగా..  వారిలో ఏ ఒక్కరు కూడా తెలంగాణ మూలాలున్న అధికారి లేరని వ్యాఖ్యానించారు. ‘‘కల్వకుంట్ల రాజ్యంలో ... నిన్న పార్టీలో... నేడు పరిపాలనలో మాయమైపోయిన తెలంగాణం’’ అని రేవంత్‌ ట్వీట్‌ చేశారు.   

>
మరిన్ని వార్తలు