15 మంది టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లోకి.. 

24 Oct, 2021 04:53 IST|Sakshi

హుజూరాబాద్‌ ఎన్నిక తర్వాత చేరేందుకు సిద్ధం: షబ్బీర్‌ అలీ

సాక్షి, హైదరాబాద్‌: హుజూరాబాద్‌ ఉప ఎన్నికలు ముగిసిన తర్వాత 15 మంది టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని మాజీమంత్రి, టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ కన్వీనర్‌ షబ్బీర్‌ అలీ తెలిపారు. ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సిద్ధమయ్యారని, అందుకే ఆ పార్టీ నేతలు మతిభ్రమించి మాట్లాడుతున్నారని శనివారం మీడియాతో మాట్లాడుతూ ఆయన వ్యాఖ్యానించారు.

ప్రగతిభవన్‌లో గాడ్సే కొత్త అవతారం విశ్రాంతి తీసుకుంటోందని అన్నారు.   గాడ్సేకు పెద్ద శిష్యుడు లాంటి కేంద్ర హోం మంత్రి అమిత్‌షాను దాదాపు ప్రతివారం కేసీఆర్‌ ఎందుకు కలుస్తారో సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.  

>
మరిన్ని వార్తలు